Friday 25 October 2013

PSLV C-25 ప్రయోగానికి సిద్దం


By on 21:43

సూళ్ళూరుపేట, న్యూస్ లైన్ :  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంగారక ఉపగ్రహ ప్రయోగానికి సిద్దమైందని షార్ సంచాలకులు MYS ప్రసాద్ తెలిపారు. శుక్రవారం షార్ లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన ప్రయోగ వివరాలను వెల్లడించారు. మార్స్ అర్బిటల్ మిషన్ (MOM) అనే ఉపగ్రహాన్ని పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా నవంబర్ 5న మధ్యాహ్నం 2.36 గంటలకు నింగిలోకి పంపనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు రూ. 450 కోట్లతో చేపట్టినట్లు తెలిపారు. 
అంగారక కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపి, అర్ధవంతమైన ప్రయోగాలను చేపట్టగల సాంకేతిక సత్తా  భారత్ కు ఉందని చాటడం ఈ యాత్ర లక్ష్యమన్నారు. అంగారకుడిపై జీవన్వేషణ జరపడంతో పాటు ఆ గ్రహాన్ని ఫోటోలు తీయడం, వాతావరణాన్ని  అధ్యయనం చేయడంవంటి లక్ష్యాలను నేరవేరుస్తున్ధన్నారు.
మార్స్ ఆర్బిటాల్ మిషన్ కి  రూ. 150 కోట్లు, సోలార్ శాటిలైట్ లంచ్ వేహికల్ కు రూ. 110 కోట్లు, ఇతరత్ర కర్చులకు రూ. 190 కోట్లు వ్యయం చేసినట్లు తెలిపారు. 2014 సెప్టెంబర్ 29న అంగారకుడి ఉపగ్రహం సమీపిస్తుందని చెప్పారు.

About Syed Faizan Ali

Faizan is a 17 year old young guy who is blessed with the art of Blogging,He love to Blog day in and day out,He is a Website Designer and a Certified Graphics Designer.

0 comments:

Post a Comment